‘దేవర’లో సెకండ్ హీరోయిన్.. టాలీవుడ్ లోకి మరాఠీ బ్యూటీ

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో దేవర మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్కు పరిచయం కానుంది. ఎన్టీఆర్తో జాన్వీ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అయితే రీసెంట్గా ఈ సినిమా గురించి మరో వార్త వైరలవుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండనున్నట్లు సమాచారం.

‘దేవర’తో ఓ మరాఠీ నటి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు సమాచారం. మరాఠీ బ్యూటీ శ్రుతి మరాటే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించనున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. ‘దేవర’లో హీరో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయనున్నారట. అందులో ఒక రోల్కు జాన్వీ హీరోయిన్గా నటించగా, రెండో పాత్రకోసం శ్రుతి మరాటే జతకట్టనుందని టాక్. కానీ, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news