‘ఛలో దిల్లీ’కి రైతుల పిలుపు.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

-

ఫిబ్రవరి 13వ తేదీ హర్యానా రైతులు  ‘ఛలో దిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆ ప్రభుత్వం అప్రమత్తమైంది.  7 జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్​ ఎస్​ఎమ్​ఎస్​ సేవలను నిలిపివేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైథాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఇంటర్నెట్​ను నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఆదేశాలను పాటించాల్సిందిగా హర్యానా ఇంటర్నెట్​ సర్వీస్ ప్రొవైడర్లకు తెలియజేశారు. వ్యక్తిగత ఎస్​ఎమ్​ఎస్, మొబైల్​ రీఛార్జ్​, బ్యాంకింగ్ ఎస్​ఎమ్​ఎస్, వాయిస్ కాల్స్, బ్రాడ్​బ్యాండ్, కార్పొరేట్- డొమెస్టిక్ లీజ్​ లైన్స్​కు మినహాయింపు ఇచ్చింది అక్కడి సర్కార్.

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్​కేఎమ్​), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎమ్​ఎమ్​) వంటి 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ‘ఛల్లో దిల్లీ’కి పిలుపునిచ్చాయి. గత కొంత కాలంగా కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ చేస్తూ హర్యానా, పంజాబ్ రైతులు నిరసన చేస్తున్నారు. రైతుల ఆందోళనతో ఏడు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఏజీడీపీ, సీఐడీ హర్యానా తన దృష్టికి తీసుకువచ్చినట్లు హరియాణా జాయింట్ సెక్రటరీ తెలిపారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్స్​, సోషల్ మీడియా ద్వారా పుకార్ల వ్యాప్తిని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news