రేషన్ కార్డులపై CM రేవంత్ శుభవార్త !

-

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైన ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ కోసం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే అర్హులకు కార్డులు లేని పక్షంలో ఆ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకానికి తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రత్యేక భద్రతాకార్డులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు.

కాగా, కాలేశ్వరం ప్రాజెక్టుపై తమ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రధానంగా KRMB పరిధిలోని అంశాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులు, ఇటీవల కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై నిపుణులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈరోజు సాయంత్రం సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 13న ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news