ఒంగోలు లో పోటీ చేసినా చెయ్యకపోయినా.. ఆ ఒక్కటి చేస్తాను: బాలినేని

-

ఒంగోలు నుండి పోటీ చేసిన చేయకపోయినా పేదలకు పట్టాలు పంపిణీ చేసే తీరుతానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల నుండి తాను ఎనిమిది లక్షలు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. కొందరు కావాలని తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కానీ అది నిజమని నిరూపిస్తే తను రాజకీయాలను తప్పుకుంటానని అన్నారు. ఈ నెల 20న ఒంగోలు లో 25వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేస్తానని బాలినేని అన్నారు. పట్టాల పంపిణీ అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని అన్నారు. పిల్ వేసారని వారికి ప్రజలు బుద్ధి చెప్తారని బాలినేని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news