సభ అట్టర్ ఫ్లాప్..మంత్రి కొట్టు పవన్ కి సవాల్..!

-

తాడేపల్లిగూడెం లో జరిగిన జెండా బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి జనసైనికులు ఆశ్చర్యపోయారని ఆయన ఒక నియంతలాగా కార్యకర్తలని శాసించాడని తన నిర్ణయాలు ఎవరూ ప్రశ్నించకూడదని తనని తప్పు పట్టకూడదని అనడంతో పార్టీ కార్యకర్తలు తెల్ల ముఖం వేశారని అన్నారు.

పవన్ నాలుగవ పెళ్ళాం జగన్ అనడం మీద ఆ నాలుగో పెళ్ళం ఎవరో అందరికీ తెలుసని పేరు చెప్పడం ఇష్టం లేక బయట పెట్టట్లేదని సంచలన కామెంట్స్ చేశారు. మొత్తానికి జెండా సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పరిపాలన గురించి తెగ పొగిడారని ఆయనకు నేను ఒక సవాల్ విసురుతున్నానని జగన్ నాలుగేళ్ల పరిపాలన చూపించి ఓట్లు అడిగే దమ్ము మాకు ఉందని కానీ పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన చూపించి ఓట్లు అడిగే దమ్ము ఉందా అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news