ఈనెల 8న ఓల్డ్ సిటీలో రెండో దశ మెట్రో పనులను ప్రారంభించనున్నరేవంత్ రెడ్డి

-

ఈనెల 8న ఓల్డ్ సిటీలో రెండో దశ మెట్రో పనులను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా 5.5 కిలో మీటర్ల మెట్రో లైన్ నిర్మాణం ఉంటుంది. 5.5 కిలోమీటర్లలో ఐదు మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషేర్ గంజ్ లలో మెట్రో స్టేషన్ల ఏర్పాటు చేస్తారు.

Revanth Reddy will start the second phase of metro works in Old City on 8th

అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రేపు సంగారెడ్డిలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు పయనం అవుతారు. ఈనెల 6న మహబూబ్ నగర్ పర్యటన, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంను ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి. 7వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన., కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానంను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news