భవ్య, వైష్ణవి కేసుని పట్టించుకోవట్లేదు: కవిత

-

భవ్య వైష్ణవి కేసుని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నిందితుల్ని వెంటనే శిక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొద్ది రోజుల క్రితం భువనగిరి ఎస్సీ హాస్టల్లో భవ్య వైష్ణవి అనే విద్యార్థులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రం లో సంచలనంగా మారింది ఈ ఘటనకు సంబంధించి విద్యార్థినిలు తల్లిదండ్రుల్ని కవిత కలిసారు.

దీని మీద కవిత ట్విట్టర్ ఖాతాలో భువనగిరి ఎస్సీ హాస్టల్లో అనుమానస్పదంగా మరణించిన భవ్య వైష్ణవి కేసుని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని అన్నారు దోషుల్ని శిక్షించాలని తల్లిదండ్రులు పోరాడుతున్న పట్టించుకోరా అన్నారు న్యాయ విచారణ ఎందుకు జరగలేదని ఆ ఇద్దరు చిన్నారులు కుటుంబాలు చేస్తున్న పోరాటానికి నా సంపూర్ణ మద్దతు అని పోస్ట్ చేశారు కవిత.

 

Read more RELATED
Recommended to you

Latest news