Yadadri : భట్టి విక్రమార్క, కొండా సురేఖను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి !

-

Yadadri : భట్టి విక్రమార్క, కొండా సురేఖను అవమానించారు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు. యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క, కొండా సురేఖను కింద కూర్చోబెట్టారు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy insulted Bhatti Vikramarka and Konda Surekha

దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. దీంతో భట్టి విక్రమార్క, కొండా సురేఖను దారుణంగా అవమానించారని..రెడ్డి అహంకారంతో…సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నాడని ఫైర్‌ అవుతున్నారు. కాగా, అనంతరం భద్రాచలం చేరుకుని శ్రీ సీతారమచంద్ర స్వామివారిని దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

అటు మధ్యాహ్నం భద్రాచలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించనున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం రేవంత్….సాయంత్రం 4 గంటలకు మణుగూరులోని ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news