టీడీపీకి బిగ్ షాక్… వైసీపీలోకి మాజీ మంత్రి జవహర్ ?

-

వైసీపీ లోకి మాజీ మంత్రి జవహర్ రాబోతున్నారని కొంత మంది వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. నిన్న రాత్రి విజయవాడ లో కేశినేని నానితో జవహర్.. భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీలోకి చేరికపై కేశినేని నానితో జవహర్..చర్చించారట. ఇక ఇవాళ సాయంత్రానికి దీనిపై క్లారిటీ రానుంది. ఇక తాజాగా తెలుగు దేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జవహర్‌.

ఈ సారి ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేయటం ఖాయమని…పోటీ ఎలా అనేది కార్యకర్తల అభిష్టం మేరకు వెళతానని వెల్లడించారు జవహర్. కొవ్వూరులో ఉన్న 11 మంది ఆశావాహులు కాదని స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటూ చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు.

 

నాకు కాదంటే నా తనయుడికి టికెట్ ఇవ్వండి….టిడిపి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రిగా ఉన్న నాతో సంప్రదించకుండా టిక్కెట్ కేటాయించడం ఏమిటి అంటూ నిప్పులు చెరిగారు జవహర్. మా పోరాటం చంద్రబాబుతో కాదు పెండ్యాల అచ్చిబాబుతో తేల్చుకుంటా అంటూ ఫైర్‌ అయ్యారు జవహర్. ఇక జవహర్ చేసిన వ్యాఖ్యలతో ఆయన వైసీపీలోకి వెళతారని అందరూ అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news