మోడీ మారిపోయిన మనిషి..!

-

ఎన్సీపీ అధ్యక్షుడు శరత్ పవర్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి కీలక కామెంట్స్ చేసారు. తన వేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని గతంలో మోడీ చేసిన ప్రకటనని గుర్తు చేస్తూ పవార్ ఇప్పుడు మోడీ అనుసరిస్తున్న భిన్నమైన వైఖరి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మహారాష్ట్రలో బారామతి పార్లమెంట్ నియోజకవర్గం లో జరిగిన సభలో ప్రసంగించిన పవార్ వ్యక్తిగత దాడులు భిన్నమైన భావజాలం ఉన్న వాళ్ళ పై తీసుకుంటున్న చర్యల విషయంలో మోడీపై మండిపడ్డారు.

నేను కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో నేను గుజరాత్ కి ఎంతో సహాయం చేశాను ఆ రోజు మోడీ ఏ పార్టీ వాడనే సంగతి చూడలేదు. తన రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉండాలని భావించాను అందుకని సహాయం చేశానని అన్నారు ఒకసారి భారామతికి ఆహ్వానించిన సమయంలో మోడీ మాట్లాడుతూ చేయమని నేర్పించారని అన్నారు. ఇప్పుడు అతను భిన్నంగా చూస్తున్నాడని అన్నారు మోడీని విమర్శించడం లేదా భిన్న వైఖరి తీసుకుంటే వాళ్ళని జైలుకి పంపుతున్నారు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news