తెలంగాణలో ఎక్కడ కరెంటు కోతలు లేవు – డిప్యూటీ సీఎం భట్టి

-

తెలంగాణలో ఎక్కడ కరెంటు కోతలు లేవు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు బంధు ఇవ్వలేదని బీఆర్​ఎస్​ నేతలు ప్రచారం చేశారని..  రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు ఉంచామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రమాణస్వీకారం చేసిన రోజు ఖజానాలో ఉన్నది మైనస్​ రూ.3960 కోట్లు అని స్పష్టం చేశారు.

Deputy CM Bhatti Vikramarka about telangana power cuts

విద్యుత్​ సబ్సిడీ కింద రూ.3,924 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.  రాష్ట్రంలో ఎక్కడా పవర్​ కట్​ లేదని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్​ సరఫరా చేస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబీమా నిధులు రూ.734 కోట్లు చెల్లించామని, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

 

Read more RELATED
Recommended to you

Latest news