వైఎస్ జగన్ మేమంతా సిద్ధం రేపటి షెడ్యూల్ ఇదే !

-

వైసీపీ అధినేత, సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా ముగిసింది.ఇక.. రేపు (మంగళవారం) జరగబోయే యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసారు.ముఖ్యమంత్రి జగన్.. ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవివి సిటీలో యాత్ర నిర్వహించి,ఆ తర్వాత మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు.

చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని.. బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

.

Read more RELATED
Recommended to you

Latest news