పిఠాపురంలో పవన్ ని తప్పిస్తారేమో..సజ్జల సంచలన కామెంట్స్..!

-

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు వందల కొద్ది హామీలు ఇస్తున్నారని.. తన వాళ్లనే బీజేపీ నుంచి పోటీ చేయిస్తున్నారని మండిపడ్డారు. భీమవరం, అవనిగడ్డలో ఇలాగే చేశారని.. ఇప్పుడు అనపర్తిలో టీడీపీ నేతను బీజేపీలోకి పంపుతున్నారని  పేర్కొన్నారు.

పిఠాపురంలో సైతం పవన్ కళ్యాణ్ ని తప్పించి వర్మను బరిలో దింపుతారేమోనని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. విపక్ష కూటమి చంద్రబాబు కోసమే ఏర్పడిందని ఎద్దేవా చేశారు. మొత్తం సీట్లు తన పట్టులో ఉండాలని.. చంద్రబాబు భావిస్తున్నారని తెలిపారు. కూటమిలో సీట్లన్నీ చంద్రబాబు ఆధీనంలో ఉండాలని.. భావిస్తున్నట్టు తెలిపారు. అందుకే జనసేనకు 21 సీట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని తెలిపారు. 2014లో ఇదే కూటమి అనేక హామీలిచ్చి మోసం చేసిందన్నారు. టీడీపీలో తండ్రి, కొడుకుల రాజకీయం మాత్రమే నడుస్తుంది అన్నారు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news