నా తల్లిని అవమానించారు.. బొత్సపై షర్మిల ఫైర్..!

-

జగన్ క్యాబినెట్ పై షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. వైయస్సార్ ని తిట్టిన వాళ్లే జగన్ క్యాబినెట్లో ఉన్నారని అన్నారు బాపట్ల జిల్లా రేపల్లెలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భం గా షర్మిల మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ మీద మండిపడ్డారు. తన తల్లి విజయమ్మని బొత్స అవమానించాలని గుర్తు చేశారు.

జగన్ ని ఉరితీయాలని కాంగ్రెస్ హయాంలో ఇదే బొత్స వ్యాఖ్యనించారని ఆమె ఫైర్ అయ్యారు. దివంగత వైయస్సార్ ని అసెంబ్లీ లో బొత్స తిట్టిపోసిన విషయాన్ని జగన్ మర్చిపోయారని అన్నారు. జగన్కి బొత్స సమానులట అని ఎద్దేవా చేశారు. షర్మిల వైయస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన వాళ్లకి జగన్ పెద్దపీట వేశారని ఆమె అన్నారు. జగన్ కోసం పాదయాత్ర చేసిన వాళ్లు ఆయనకి ఏమి కారట అని షర్మిల సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news