IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

8 మ్యాచ్లలో 4 గెలుపులతో గుజరాత్ టైటాన్స్ ఆరో స్థానంలో, 3 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో ప్లేస్లో ఉన్నాయి. నేడు గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరు జట్ల కెప్టెన్లు గిల్, పంత్ భావిస్తున్నారు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఈ టీమ్ లు 4 సార్లు తలపడగా, చెరో రెండు సార్లు గెలిచాయి.

ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్ : పృథ్వీషా, అభిషేక్, జేక్ ఫ్రేజర్-మెక్లుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, పంత్ (C & WK), అక్షర్, కుల్దీప్, నోకియా, హోప్, ముకేశ్, ఖలీల్ అహ్మద్.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాహా, గిల్(C), మిల్లర్, ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, తెవాటియా, రషీద్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్, మోహిత్.

Read more RELATED
Recommended to you

Latest news