కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం రేవంత్‌రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉండటంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అందుకే ప్రతి ఒక్కరు తమ చేతిలో ఉన్న ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు.

రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో కుటుంబసభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ఓటు వేయగా అదే జిల్లాలో గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు వేశారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news