ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లోని సీసీటీవీలను ఆఫ్ చేయడంపై సందేహాలు : సుప్రియా సూలే

-

బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లోని సీసీటీవీలను దాదాపు 45 నిమిషాల పాటు ఆఫ్ చేయడంపై శరద్ పవార్ కుమార్తె, బారామాతి లోక్‌సభ అభ్యర్థి సుప్రియా సూలే సందేహాలున్నాయని ఆరోపించారు . లోపల ఏదో తప్పు జరిగిందని ఆమె అసహనం వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన బారామతి స్థానానికి మే 7న మూడవ దశలో పోలింగ్ జరిగింది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి , ఎన్సీపీ రెబల్ అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బీజేపీ అభ్యర్థిగా ఉండగా, ఆమెపై సుప్రియా సూలే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం ఈవీఎంలను బారామతిలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌లో భద్రపరిచారు.

అయితే, ఈవీఎంల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీలను సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంట్ల మధ్య 45 నిమిషాల పాటు ఆఫ్ చేశారని ఆమె ఆరోపించారు . ఈ విషయాన్ని తమ సిబ్బంది ఎన్నికల అధికారులకు, పోలీసులకు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news