2024 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే? : ప్రశాంత్ కిషోర్

-

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గతసారి ఫలితాలే రిపీట్ చేసే అవకాశం ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అంచనా వేశారు. బీజేపీ మీద దేశంలో పెద్దగా కోపం గానీ సవాల్‌ విసిరే వ్యక్తులు గానీ లేరని, ఆ పార్టీని మోదీ మరోసారి విజయతీరాలకు చేరుస్తారని తెలిపారు. 2019లో బీజేపీకి 303 సీట్లు వచ్చినట్లే ఈసారీ అటూ ఇటుగా, లేదా కాస్త ఎక్కువే వచ్చే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు.

మరోవైపు రాహుల్‌ గాంధీ వస్తే పరిస్థితి ఇంకొంత మెరుగవుతుందన్న భావన ఆయన మద్దతుదారుల నుంచి మాత్రమే కనిపిస్తోందని పీకే పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదని అభిప్రాయపడ్డారు. 325 లోక్‌సభ స్థానాలు ఉండే ఉత్తర, పశ్చిమ భారతం 2014 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉందని… 225 నియోజకవర్గాలు ఉన్న తూర్పు, దక్షిణ భారతంలో బీజేపీకి ప్రస్తుతం 50 కంటే తక్కువ సీట్లున్నాయని చెప్పారు. ఈసారి దక్షిణాదిలో బీజేపీ కాస్త మెరుగయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లోనే బీజేపీకి నష్టం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news