రాజా!! మిమ్మల్ని తిట్టినోళ్లంతా ఓడిపోయారు.. రజినీకాంత్​తో ఎంపీ బాలశౌరి

-

ఇవాళ ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆహ్వానం అందుకున్న ప్రముఖులు ఒక్కొక్కరుగా విజయవాడ చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా బాబు ప్రమాణస్వీకారానికి వచ్చారు. అయితే రజినీకాంత్‌ దిల్లీ విమానాశ్రయంలో ఉండగా.. అక్కడికొచ్చిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గతంలో ఉన్న పరిచయంతో ఆయనను పలకరించారు.

బాలశౌరి రజినీతో మాట్లాడుతూ మాటల మధ్యలో ‘గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కదా. సార్ మిమ్మల్ని తిట్టిన వాళ్లంతా ఈ ఎన్నికల్లో వారంతా ఓడిపోయారు’ అని చెప్పారు. దీంతో రజనీకాంత్‌ చిరునవ్వుతో.. ‘మనకు నచ్చింది మనం మాట్లాడతాం.. దానికే తిడితే ఎలా? అలా తిట్టకూడదు కదా?’ అని పేర్కొన్నారు. ‘జనసేనలో చేరి మంచి పనిచేశారు. పవన్‌ కల్యాణ్‌ మంచి నాయకుడు అవుతారు’ అని ప్రశంసించారు.

గతంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్‌.. తన మిత్రుడైన చంద్రబాబును ప్రశంసిస్తూ మాట్లాడారు. దీంతో వైసీపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, రోజా తదితరులు రజనీకాంత్‌పై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news