ఏపీ కేబినెట్​లో జనసేనకు 3 బీజేపీకి 1 సీటు

-

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు పవన్ కల్యాణ్ మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఉంటారు. పవన్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనహోర్, కందుల దుర్గేశ్​కు చోటు లభించగా.. బీజేపీ నుంచి సత్యకుమార్ చోటు దక్కించుకున్నారు.

సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news