నెట్టింట ‘మోదీ కా పరివార్’ ట్యాగ్ తొలగించాలని ప్రధాని ఆదేశం

-

సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇస్​బార్ చార్ సౌ పార్ నినాదంతో పాటు మోదీ కా పరివార్ అనే నినాదాన్ని కూడా గొంతెత్తిన విషయం తెలిసిందే. ఆయనతో బీజేపీ నేతలంతా మోదీ కా పరివార్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఇందుకోసం సోషల్ మీడియాలోని తమ అకౌంట్లలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మోదీ కా పరివార్‌ అనే ట్యాగ్ పెట్టుకున్నారు.

అయితే తన అభిమానులు పెట్టుకున్న ఆ ట్యాగ్​ను ఇప్పుడు తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఎన్నికల ప్రచారంలో తన పట్ల చూపించిన అభిమానం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రజాభిమానం నుంచి తాను బలాన్ని పొందినట్లు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని .. దేశ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించడానికి తమని ప్రజలు ఆదేశించారని మోదీ పేర్కొన్నారు. అందరం ఒకే కుటుంబమని ఎక్స్‌లో ఇచ్చిన సందేశానికి ప్రధాని కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు తమ అకౌంట్లలో పేర్కొన్న మోదీ కా పరివార్‌ సందేశాన్ని తొలగించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news