ప్రతీకారం తీర్చుకుంటాం.. కథువా ఉగ్రదాడి ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్‌

-

కథువా  ఉగ్రదాడి ఘటన పై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి  గిరిధర్ అరామనె  స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కథువాలోని బద్నోటాలో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లను కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సైనికుల నిస్వార్థ సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. వారి త్యాగానికి ప్రతీకారం తీర్చుకుంటాం. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను భారత్ మట్టుబెడుతుంది’ అని పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో భారత సైనికులు జరిపిన ఎన్‌కౌంటర్లపై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పూనుకున్నారు. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఉగ్రవాదులు కొండపై నుంచి గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలతో ఈ దాడి చేశారు. వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరుపగా, ఉగ్రవాదులు పారిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news