Breaking News : హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు

-

సినిమా రేంజ్‌ ట్విస్టులతో రాజ్‌ తరుణ్ కేసు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వ్వహరంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. తనను ప్రేమించి మోసం చేశాడని, పదేళ్లు తనతో రిలేషన్ షిప్ లో ఉండి.. ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో ఉంటున్నాడని హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య. మాల్వీ వచ్చిన తరువాత రాజ్ తరుణ్ తనను మోసం చేసాడని పోలీసులకు వివరించింది. త్వరలో రాజ్ తరుణ్ కేసు కి సంబంధించి  నోటీసులు ఇవ్వాలని లావణ్యకు చెప్పారు పోలీసులు.  చెప్పినట్టుగానే ఆధారాలను సమర్పించారు.  లావణ్య కి అబార్షన్ చేయించిన పేపర్స్ కూడా అందించినట్టు తెలిపారు పోలీసులు. రాజ్ తరుణ్ పోలీసులు విచారించనున్నారు. దాదాపు 11 ఏళ్ల కిందటే పెళ్లి జరిగిందని తెలిపారు లావణ్య. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news