షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ లో దోపిడి..టైగర్ నాగేశ్వర్ రావు సినిమా రేంజ్ లో !

-

షిరిడి సాయిబాబా భక్తులకు ఊహించని షాక్‌ తగిలింది. షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ లో దారి దోపిడి చోటు చేసుకుంది. షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ లోని మూడు భోగిలో తెల్లవారుజామునే దొంగలంతా దొచేశారు. ప్రయాణికులు లగేజీ మొత్తాన్ని ఎత్తుకొని పోయిన దొంగలు… ట్రైన్‌ నుంచి పరార్‌ అయ్యారు.

Robbery in the train coming from Shirdi to Secunderabad

ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా లగేజ్ ని దోచుకుని పోయారు దొంగలు. బీదర్ రాగానే లగేజ్ చోరీ అయినట్లు గుర్తించారు ప్రయాణికులు. బీదర్లో ట్రైను ఆపేసి ఆందోళనకు దిగారు ప్రయాణికులు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌ గా మారింది.

దీనిపై దోపిడీకి గురైన రైల్వే ప్రయాణికులు మాట్లాడుతూ… అర్ధరాత్రి అందరు పడుకున్న తర్వాత వరుసగా దోపిడీ చేశారన్నారు. ఒక భోగి నుండి మరో భోగిలోకి లింకు ఉండడంతో మూడు భోగిలలో దోపిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బ్యాగులోంచి బంగారు ఆభరణాలు, నగలు, నగదు ఎత్తుకొని పోయారన్నారు. మొత్తం ముగ్గురు వచ్చినట్లుగా మాకు అనుమానం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news