షూటింగ్ ఫైనల్స్ లో భారత్.. మొదటి మెడల్..?

-

ప్యారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలంపిక్స్ లో మెడల్స్ వేట మొదలయింది. అయితే ఇండియాకు ఎన్నో ఆశలు ఉన్న షూటింగ్ లో భారత 22 ఏళ్ళ షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో ఫైనల్స్ లో అర్హత సాధించింది. మొత్తంగా 600 పాయింట్స్ కు గాను 580 పాయింట్స్ తో గ్రూప్ దశలో 3 వ స్థానంలో నిలిచి ఫైనల్స్ లోకి ఎంటర్ అయ్యింది.

కానీ ఓవరాల్ గా అత్యధికంగా 27x 10 పాయింట్స్ ను సాధించింది. ఇక ఈ పోటీలోనే ఉన్న మరో భారత షూటర్ సాంగ్వాన్ రిథమ్ 573 పాయింట్స్ తో 15 వ స్థానంలో నిలిచి గ్రూప్ స్టేజ్ నుండే ఎలిమినేట్ అయ్యింది. కానీ మను భాకర్ ఈ ఒలంపిక్స్ లో మొదటి మెడల్ దేశానికి సాధిస్తుంది అనే అంచనాలతో భారతీయులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news