పోలవరం ఎమ్మెల్యే కారుపై దాడి..పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్‌?

-

పోలవరం ఎమ్మెల్యే కారుపై దాడి సంఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరిగింది. కొందరు దుండగులు కావాలనే టార్గెట్‌ చేసి మరీ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి చేశారు.గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసరడంతో బద్ధలైంది కారు అద్దం.

Polavaram MLA Chirri Balaraju’s car attacked

ఇక పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి పై స్పందించారు పవన్‌ కళ్యాణ్‌. పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారి వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితం బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. దాడి సమయంలో ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news