పెద్దిరెడ్డి ఊచలు లెక్కపెట్టడం ఖాయం.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి పెద్దిరెడ్డి జైలులో ఊచలు లెక్కపెట్టడం ఖాయమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం చిత్తూరు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎల్లుండి పుంగనూరులో పర్యటిస్తానని ప్రకటించారు మంత్రి. పెద్ది రెడ్డి బాధితులు అందరి వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు.

దీని కోసం పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత బస్సు విధానాన్ని అధ్యయనం చేస్తున్నాం. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం కార్యక్రమం అమలుకు శ్రీకారం చుడుతాం. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసింది. ప్రజా రవాణా వ్యవస్తను నిర్లక్ష్యం చేసింది. ఆర్టీసీ సంస్తను గాడిలో పెట్టడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడం కోసమే కొత్త బస్సులు తీసుకొస్తున్నాం. అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news