కంగనా రనౌత్ “ఎమర్జెన్సీ” మూవీకి సెన్సార్ పూర్తి

-

కంగనా రనౌత్ “ఎమర్జెన్సీ” సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఆదివారం ఈ మూవీ ఎట్టకేలకు సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సిక్కు వర్గాల నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో గతంలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారిని నిలిపివేసింది.

దీంతో ఈ నెల 6వ తేదీన విడుదల కావలసిన ఎమర్జెన్సీ మూవీ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు.. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కంగనా కథానాయికగా నటిస్తున్నారు.

ఆమె స్వీయ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. ఇక ఈ చిత్రంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, అనుపమ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, టీజర్ లాంటివి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనుంది యూనిట్.

Read more RELATED
Recommended to you

Latest news