తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కి జాతీయ స్థాయిలో గుర్తింపు

-

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్ సింగ్ సైబర్ నేరాల నియంత్రణలో ఉత్తమ పని తీరు కనబరిచినందుకు   కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకున్నారు. 

సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో “సమన్వయ్” పేరుతో అనుసంధాన వ్యవస్థను రూపొందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషించిన పాత్రకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు దక్కడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ ప్రణాళికల్లోనూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news