ఇవాళ తెలంగాణ కేబినేట్‌ సమావేశం..రైతు భరోసాపై ప్రకటన !

-

ఇవాళ తెలంగాణ కేబినేట్‌ సమావేశం కానుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనున్నారు. ఇక ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది.

Telangana cabinet meeting today

హైడ్రా కు చట్ట బద్దత ద్వారా ఆర్డినెన్సు తీసుకురావడం?, మూడు యూనివర్సిటీలకు పేర్లు ఖరారు చేయడం లాంటి అంశాలపై తెలంగాణ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. భారీ వర్షాలు- వరదల కారణంగా జరిగిన నష్టం, రేషన్ కార్డులు జారీ, హెల్త్ కార్డులు మంజూరుపై కూడా చర్చించనుంది తెలంగాణ కేబినెట్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, త్రిబుల్ ఆర్ భూసేకరణ, పనుల ప్రారంభం, ఎస్ఎల్బిసి పనులు – నిధుల విడుదల, ఉద్యోగుల డిఎలు – సమస్యలు తదితర అంశాలపై చర్చ ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news