AP : తేనెటీగల ఆకస్మిక దాడి.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

-

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా లంకపేటలో దారుణం చోటుచేసుకుంది. అనుకోకుండా ఐదుగురు గ్రామస్థుల పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం సాయంత్రం వేళ రణస్థలం మండలం లంకపేట గ్రామంలో ఐదుగురిపై ఉన్నట్టుండి తేనెటీగలు దాడి చేశాయి.

 

తేనెటీగల దాడిలో అక్కడికక్కడే ఇద్దరు గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. తేనెటీగల దాడిలో గాయపడిన పలువురిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.వారికి వైద్యులు చికిత్స అందించారు. అయినప్పటికీ ముగ్గురు పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు చెప్పగా..మెరుగైన వైద్యం కోసం విశాఖ కెజీహెచ్‌కు తరలించారు. కాగా, మృతులను కిల్లారి కాంతమ్మ, కిల్లరి సూరిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అసలు తేనెటీగలు ఎందుకు దాడి చేశాయి. ఆ టైంలో గ్రామస్తులు అక్కడ ఏం చేస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news