కిడ్నాప్,బెదిరింపు ఆరోపణలు.. ఫైజాబాద్ ఎంపీ కొడుకుపై కేసు

-

వ్యక్తుల అపహరణ, బెదిరింపులకు పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఫైజాబాద్‌ సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి మీద వ్యక్తి కిడ్నాప్,బెదిరింపులు, దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు రాగా, ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.స్థానిక ప్రాపర్టీ డీలర్ రవి తివారీ ఫిర్యాదుతో కేసు పెట్టామన్నారు.

నిందితుడు అజిత్ ప్రసాద్, రాజు యాదవ్ సహా 15 నుంచి 20 మంది శనివారం తనపై దాడి చేశారని బాధితుడు రవి తివారీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు తమ వాహనంలోకి తనని లాగి పరీక్ష టైంలో భౌతికంగా దాడి చేస్తూ రఖాబ్‌గంజ్ వైపు వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.తన నుంచి రూ.లక్ష తీసుకున్నారని, దాడికి చెందిన వీడియోని రికార్డు చేశారని చెప్పాడు. తనని చంపేస్తానని కూడా బెదిరించినట్లు తెలిపారు.దీంతో నిందితులు అజిత్ ప్రసాద్, రాజు యాదవ్, కానిస్టేబుల్ శశికాంత్ రాయ్ సహా 15 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news