త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు – పొంగులేటి

-

త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు మంత్రి పొంగులేటి. స్మార్ట్ కార్డ్ ను వచ్చే నెల రెండోతారీకు నుంచి ఇవ్వబోతున్నామని చెప్పారు. సంక్రాంతి లోపే స్మార్ట్ కార్డ్ ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు. ఈ పంట నుంచే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోతున్నామని చెప్పారు.

Minister Ponguleti announced that 3,500 Indiramma houses will be given to each constituency soon

రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా 10 వేలు ఇస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి. మునిగిన పంట పొలాలకు ఎకరానికి పది వేలు ఇస్తామని చెప్పామని.. ఇస్తామని కూడా వివరించారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలను కాపాడాలని వరదలతో నష్టపోయిన ప్రతి ఇంటికి పరిహారం ఇచ్చామని తెలిపారు.

అమృత స్కీంలో ఒక్క రూపాయి అవినీతి జరిగినా జరిగినట్లేనని KTR అంటున్నాడని… మీ పార్టీ నుంచి పాలేరు లో నామీద పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి అంట సెటైర్లు పేల్చారు. సృజన్ రెడ్డికి మీ ప్రభుత్వం లో సబ్ కాంట్రాక్టు ఇప్పించారని ఆరోపనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news