కాంగ్రెస్ పార్టీలోకి ఆర్. కృష్ణయ్య.. మల్లు రవితో చర్చలు !

-

 

తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్. కృష్ణయ్య నివాసానికి మల్లు రవి వెళ్లారు. ఈ సందర్బంగా బీసీ సంఘం అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటి అయ్యారు. ఆంద్రప్రదేశ్ వైస్సార్సీపీ రాజ్య సభ ఎంపీగా ఉన్న ఆర్. కృష్ణయ్య నిన్ననే రాజీనామా చేయడం జరిగింది.

President of the BC Association, former MP R MP Mallu Ravi met with Krishnaiah

ఈ సందర్బంగా బీసీ సంఘం అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటి కావడంతో… ఆయన కాంగ్రెస్ పార్టీ లోకి వెళతారని ప్రచారం జరిగింది. కాగా, నిన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ ఇచ్చారు ఆర్ కృష్ణయ్య. అయితే తాజాగా ఆర్ కృష్ణయ్య ఇచ్చిన రాజీనామాను ఆమోదించారు రాజ్యసభ చైర్మన్.

ఆర్ కృష్ణయ్య స్థానం ఖాళీ అయిందంటూ బులిటెన్ విడుదల చేసారు రాజ్యసభ సెక్రటరీ. అయితే రాజ్యసభలో గతంలో 11 మంది వైసీపీ తరఫున ఎంపీలు ఉండగా.. అందులో నుండి ఇప్పటికే రాజీనామా చేసారు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు. ఇక ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసారు. అయితే కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 8కి పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news