హర్షసాయి బాధితురాలుకు వైద్య పరీక్షలు..!

-

యూట్యూబర్ హర్షసాయి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబర్‌ కమ్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌గా పాపులార్టీ కొట్టేసి.. పాన్‌ ఇండియా మూవీలో నటించే స్థాయికి ఎదిగిన హర్షసాయిపై నార్సింగి పీఎస్‌లో రేప్‌ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది. పాన్‌ ఇండియా మూవీలో లీడ్‌ రోల్‌  సంగతేమో కానీ..నార్సింగ్‌ పీఎస్‌లో ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు కావడం గమనార్హం.

ప్రధానంగా  తన దగ్గర 2 కోట్ల రూపాయిలు తీసుకున్నాడని.. ఇప్పుడు ముఖం చేస్తున్నాడని  అడ్వొకేట్‌తో కలిసి నార్సింగి పీఎస్‌లో కంప్లేంట్‌ చేశారు. పెల్లి పేరుతో తనను మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది యువతి. ముఖ్యంగా  తమ పర్సనల్‌ ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని హర్షసాయి, అతని తండ్రి రాధాకృష్ణ పై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 376, 354 సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు. తాజాగా వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. అనంతరం ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news