ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌పై ఇనుపరాడ్లతో దుండగుల దాడి..

-

ములుగు జిల్లా తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ దామెరవాయి అటవీ ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. గురువారం రాత్రి 11:30 ప్రాంతంలో తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్‌లో అక్రమంగా భూమిని చదును చేస్తూ, చెట్లను నరుకుతున్న జేసీబీని ఎఫ్‌ఎస్‌ఓ వినోద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్ర, సుమన్‌ బృందం అడ్డుకుంది. అనంతరం జేసీబీని స్వాధీనం చేసుకుని తాడ్వాయి ఫారెస్ట్ ఆఫీసుకు తరలిస్తుండగా జేసీబీ ఓనర్ గంట సూరజ్ రెడ్డి, మరో ఇద్దరితో కలిసి అటవీ అధికారులపై విచక్షణా రహితంగా ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ధ్వంసం చేసి జేసీబీని తీసుకొని వెళ్ళగా, ఈ దాడిలో ఎఫ్‌ఎస్‌ఓ వినోద్ తలకు మూడు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. చేతి వేళ్ళు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు.శరత్ చంద్రకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే, ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిందితులను చట్టపరంగా శిక్షించాలని ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news