నరకాసురుని కథ మనకు చెబుతున్న ధర్మం.. అహంకారానికి ఎప్పుడూ ముగింపు ఒకటే!

-

దీపావళి పండుగ వెనుక ఎన్నో కథలున్నా, నరకాసుర వధ అత్యంత ముఖ్యమైనది. తన శక్తిని అడ్డుపెట్టుకుని అమాయక ప్రజల జీవితాలను చీకటిమయం చేసిన ఆ రాక్షసుడి కథ,ఇది ఒక గొప్ప ధర్మాన్ని బోధిస్తుంది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఎదురులేని వాడినని భావించే ప్రతి వ్యక్తికీ నరకాసురుని ముగింపు ఒక గుణపాఠం. అతని పతనం మనకు ఏ సందేశాన్ని ఇస్తుంది? గెలుపు ఎప్పుడూ ధర్మానిదే అని ఈ కథ ఎలా నిరూపించిందో తెలుసుకుందాం.

నరకాసురుని అహంకారం: భూదేవికి, విష్ణుమూర్తికి పుట్టినవాడైనప్పటికీ, నరకాసురుడు కేవలం తన అధికారం మరియు శక్తి పట్ల మాత్రమే గర్వపడ్డాడు. బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన తర్వాత అతని అహంకారం తారస్థాయికి చేరింది. తాను అజేయుడినని, తనను ఎవరూ ఓడించలేరని విర్రవీగాడు.

నరకాసురుని అకృత్యాలు: దేవతలను, ఋషులను హింసించాడు. ఇంద్రుడి నుంచి అధితి దేవి చెవి కమ్మలను దొంగిలించాడు.వేల సంఖ్యలో రాజకుమార్తెలను బంధించాడు. అతని అహంకారం పరాకాష్టకు చేరి, భూమిపై ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. అతని రాజ్యంలో కేవలం అంధకారం (నరకం) మాత్రమే ఉండేది.

The Story of Narakasura: Dharma’s Lesson on the End of Ego
The Story of Narakasura: Dharma’s Lesson on the End of Ego

నరకాసురుని అన్యాయాలు మితిమీరినప్పుడు, సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు. అయితే, నరకాసురుడికి ఉన్న వరం ప్రకారం, అతన్ని కేవలం అతని తల్లి మాత్రమే సంహరించగలదు. అందుకే, కృష్ణుడు తన భార్య సత్యభామ (భూదేవి అవతారం) సహాయంతో అతన్ని అంతం చేయించాడు. ఈ వధ ద్వారా కథ మనకు చెప్పే అతిపెద్ద ధర్మం ఏమిటంటే శక్తి ఎంత ఉన్నా, అహంకారం, అధర్మం ఎప్పటికీ గెలవవు.

నరకాసురుని పతనం అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఆ రోజునే ప్రజలు దీపాలు వెలిగించి చీకటిని తరిమి కొట్టారు. అందుకే నరకాసుర చతుర్దశి రోజున దీపాలు వెలిగించడం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మారింది.

నరకాసురుని కథ ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద గుణపాఠం. అధికారం, సంపద, శక్తి ఏవైనా సరే, వాటిని దుర్వినియోగం చేసి అహంకారాన్ని పెంచుకుంటే పతనం తప్పదు. మీ జీవితంలో ఎంత ఉన్నతంగా ఎదిగినా అహంకారం లేకుండా వినయంగా ఉండటం ధర్మాన్ని పాటించడం ముఖ్యం. అహంకారానికి అంతం అంధకారానికి ముగింపు అని ఈ కథ సగర్వంగా ప్రకటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news