హర్షసాయికి మరో బిగ్ షాక్.. బాధితురాలి మరోసారి ఫిర్యాదు

-

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది.హర్షసాయి సోషల్ మీడియాలో తన మీద నెగెటివ్ ట్రోలింగ్ చేయిస్తూ..మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదనవ్యక్తం చేసింది.తనను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్న వారిపై, అవన్నీ చేయిస్తున్న హర్షసాయి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో కోరింది. అందుకు సంబంధించిన పలు సోషల్ మీడియా అకౌంట్ల స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు అందించింది.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు.కాగా, యూట్యూబర్ హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి, తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం హర్షసాయి, అతని అభిమానులు తనను నెట్టింట ట్రోలింగ్ చేస్తూ..మానసికంగా వేధిస్తున్నారని తాజా ఫిర్యాదులో పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news