ఏలూరు జిల్లాలో రూ.3 లకే బిర్యానీ..ఎగబడుతున్న జనాలు !

-

ఏలూరు జిల్లాలో బిర్యానీ కోసం జనాలు ఎగబడుతున్నారు. మూడు రూపాయల బిర్యాని కోసం బారులు తీరారు జనం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నూతనంగా ప్రారంభమైన ఒక రెస్టారెంట్లో బంపర్ ఆఫర్ ప్రకటించారు. మూడు రూపాయలకే చికెన్ బిర్యానీ ప్రకటించింది రెస్టారెంట్ యాజమాన్యం.

A bumper offer has been announced at a newly opened restaurant in Jangareddygudem, Eluru district

ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఆఫర్ ఉంటుందని ప్రకటించింది రెస్టారెంట్ యాజమాన్యం. అయితే.. మూడు రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు కోసం భారీ క్యూ లైన్లలో భోజనం ప్రియులు ఉన్నారు. బిర్యానీ కోసం భారీగా బారులు తీరారు స్థానికులు. అయితే.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news