మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా సమీక్ష..!

-

రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. అమిత్ షా అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సీఎస్‌లు, డీజీపీలు. 2026 నాటికి మావోయిస్టుల సమస్య రూపుమాపడమే లక్ష్యంగా సమీక్ష జరగనుంది. ఈ హోంశాఖ సమీక్షకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ హాజరుకానున్నారు.

త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమీక్ష సమావేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రధేశ్,కేరళ, చత్తీస్‌గఢ్‌ మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news