జమ్ముకాశ్మీర్‌లో భారత జవాన్ల కిడ్నాప్?

-

భారత జవాన్లు కిడ్నాప్ అయ్యారు. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కాకర్‌నాగ్ ప్రాంతం టెరిటోరియల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్‌ను ఉగ్రవాదులు మంగళవారం ఎత్తుకెళ్లారు. ఇదే స‌మ‌యంలో మరో జవాన్ వారి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్‌లోని షాంగస్ నుంచి ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ (టీఏ) జవాన్‌ను మిలిటెంట్లు అపహరించడం స్థానికంగా కలకలం రేపింది.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఒక జవాన్ కిడ్నాప్ అవ్వడం, మరొక టిఏ జవాన్ తప్పించుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ ఘటనపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలో పెద్దఎత్తున సెర్చ్ ఆపరేషన్‌ ప్రారంభించింది. కనిపించకుండా పోయిన సైనికుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాలను జల్లెడ్ పడుతోంది. డాగ్ స్వ్కాడ్ సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉగ్రవాదుల కదలికల కోసం ఇంటెల్ సాయం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news