వరద సాయం పై వైసీపీ దుష్ప్రచారం చేయడం దారుణం : మంత్రి అనగాని

-

వరద సాయం పై వైసీపీ దుష్ప్రచారం చేయడం దారుణం అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.  ఏపీ సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వరద సహాయం పై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని.. వాళ్ల దుష్ట పత్రికలు, చానెళ్ల ద్వారా తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తాందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే అనగాని వైసీపీ పై విరుచుకుపడ్డారు. విజయవాడ వరదల్లో సీఎం చంద్రబాబునాయుడు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డారని మంత్రులు అధికారులందరూ వరద బాధితుల కోసం పనిచేశారు.

మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశంసించడం మానేసి వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కృష్ణా నదికి ఎప్పుడూ లేనంత వరద వచ్చిందని, అయినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నెలరోజుల్లోనే వదరబాధితులందరికీ నష్టపరిహారం అదించిందని చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా వరద బాధితులకు సహాయం చేస్తోందని అన్నారు. ఎంఎస్ఎంఈ ల యజమానులకు సైతం బ్యాంకు అధికారులతో మాట్లాడి సహాయం చేస్తున్నామని తెలిపారు. వరదల వల్ల ఎవరింట్లో అయినా ఫ్రిజ్ లు, టీవీలు, బైక్ లు, కార్లు ఏం చెడిపోయినా వారందరికీ నష్టపరిహారం ఇచ్చామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news