జమ్మూకశ్మీర్‌లో ప్రెసిడెంట్ రూల్ ఎత్తివేత..16న కొత్త సీఎం ప్రమాణం

-

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ఇటీవల కొత్తగా ఎన్నుకున్న ఎన్సీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా రాష్ట్రపతి పాలనను తక్షణం ఎత్తివేస్తూ కేంద్రం ఆదివారం గెజిట్‌ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం కూడా చేశారు. పదేళ్ల తరువాత జమ్మూకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా అందులో నేషనల్​ కాన్ఫరెన్స్​, కాంగ్రెస్ కూటమి విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

ఈ మేరకు ఎల్​జీకి ఓ లేఖను సమర్పించారు ఎన్​సీ ఉపాధ్యక్షుడు, సీఎం అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా.ఈ క్రమంలోనే రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది. కాగా, జమ్ముకశ్మీర్‌లో 2018లో బీజేపీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి ప్రభుత్వం కూలిపోవడంతో శాసనసభను రద్దు చేసి, 6 నెలలపాటు గవర్నర్​ పాలను విధించారు.అది కాస్త ముగియడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది.2019 అక్టోబర్​ 31న రాష్ట్రపాతి పాలనను పొడిగిస్తూ మరో నోటిఫికేషన్‌ను కేంద్రం జారీ చేసింది. ఇప్పటివరకు కొనసాగగా తాజాగా ఎత్తివేశారు. కాగా, 16న జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news