మొన్నటిదాక కోతలు.. ఇక వాతలకు సిద్ధమైన రేవంత్ సర్కార్ : కేటీఆర్ ట్వీట్

-

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి ఏడాది గడువకముందే ప్రజల మీద భారం మోపేందుకు సిద్దమయ్యారని, 9 నెలల్లో తెచ్చిన అప్పులు ఎటుపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కరెంటు చార్జీలు పెంచనున్న ప్రభుత్వం! అంటూ వస్తున్న కథనాలపై ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. కరెంటు కోతల సర్కార్.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నది. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు. కానీ, విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ అని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమైందని ఆరోపించారు. ఉచిత కరెంట్ హమీ అంతంత మాత్రమేనని, గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉందని, జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా? అని విమర్శలు చేశారు.420 హామీలకు అతీ గతీ లేదని, మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు? అని మండిపడ్డారు.9నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77వేల కోట్లు ఎటుబాయే? మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకని అన్నారు.ఈ అసమర్థుల కాంగ్రెస్ పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేనని కేటీఆర్ వాంగ్యాస్త్రాలు సంధించారు.

Read more RELATED
Recommended to you

Latest news