రష్మిక మందాన్నకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పెషల్ విషెస్!

-

సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా హీరోయిన్ రష్మిక మందన్నాను భారత ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా రష్మిక ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ‘మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాము.ఇప్పుడు సైబర్ క్రైమ్ అత్యధిక స్థాయిలో ఉంది.నా డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి బాగా వైరల్ చేశారు.ఆ ఫేక్ వీడియోని వైరల్ చేశారు. ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను.

అందుకే నేను భారత ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్నానని’ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కాగా, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌కు జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా ఎంపికైన రష్మిక మందాన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘ఎక్స్’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, దేశంలో సైబర్ భద్రతకు జాతీయ అంబాసిడర్‌గా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో సరైన అవగాహన కల్పించడంలో మీ సహకారం ఎంతో ఉపయోగపడుతుందని అభిలాషిస్తున్నట్లు’ తన ట్వీట్‌లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news