ఏపీలో తీవ్ర విషాదం..సెలవుల తర్వాత స్కూల్‌కు వెళ్లిన బాలిక ఆత్మహత్య

-

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దసరా సెలవుల తర్వాత మరుసటి రోజు స్కూల్‌కు వెళ్లిన కాసేపటికే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన జిల్లాలోని పాతపట్నంలో గల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. లావణ్య(12) ఏడో తరగతి చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలిక.. సెల‌వులు పూర్తవడంతో గురువారం పేరెంట్స్‌తో కలిసి స్కూల్‌కు వచ్చింది.

Woman software employee commits

తనకు స్కూల్‌‌లో ఉండాలని లేదని, మీతో వచ్చేస్తానని ఆ బాలిక పేరెంట్స్‌కు చెప్పగా.. వారు మళ్లీ వస్తామని నచ్చజెప్పి పంపించారు.దీంతో మనస్తాపానికి గురైన బాలిక స్కూల్‌కు వచ్చిన గంటకే గ‌దిలోకి వెళ్లి జ‌డ రిబ్బ‌న‌ుతో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అది గమనించిన తోటి విద్యార్థులు టీచర్లకు సమాచారం ఇవ్వగా అత్య‌వస‌ర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి త‌ర‌లించారు.అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read more RELATED
Recommended to you

Latest news