న్యూజిలాండ్ VS భారత్.. వర్షంతో నిలిచిన మ్యాచ్

-

న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచుకు వరుణుడు పదే పదే ఆటంకం కలిగిస్తున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. అక్కడ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా తొలిరోజు టెస్టు మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. రెండో రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కేవలం 50 పరుగులలోపే కుప్పకూలి చెత్త రికార్డును మూటగట్టుకుంది.

తాజాగా నాలుగో రోజు ఆట కొనసాగుతుండగా..మరోసారి వర్షం అడ్డుతగిలింది. తొలి సెషన్‌లో భారత బ్యాటర్ సర్ఫరాజ్ (125) సెంచరీ సాధించగా..పంత్ (53) అర్థ సెంచరీతో ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నాడు. వీరిద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే జల్లులు కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు 344/3 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news