మద్యానికి కేటీఆరే బ్రాండ్ అంబాసిడర్‌ : ఎంపీ చామల

-

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్యం గురించి మాట్లాడుతుంటే సమాజం నవ్వుకుంటోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మద్యంపై ఉన్న ద్యాస మద్దతు ధరపై లేకపాయే? అంటూ మద్యం ధరల పెంపుపై కేటీఆర్ ట్వీట్ చేయగా..దీనికి ఎంపీ చామల స్పందిస్తూ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చాడు. ‘మద్యం గురించి నువ్వు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. దేశ స్థాయిలో మద్యానికి నీ అయ్య, నీ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్‌లు అనే సంగతి మరిచిపోయినవా? ఇక నువ్వు పెట్టిన ట్వీట్..మతి తప్పి నీ అయ్య గురించి నువ్వే చెప్పినట్లు ఉందని’ ఎద్దేవాచేశారు.

కాగా, మద్యం ధరల పెంపుపై కేటీఆర్ స్పందిస్తూ.. మద్యంపై ఉన్న ధ్యాస, మద్దతు ధరపై, మంచి బోధనపై, మందు బిళ్లలపై, మూసీ బాధితులపై, మంచినీళ్లపై, పింఛన్ పెంపుపై, భరోసా పెంపుపై లేకపాయే అని సంచలన ఆరోపణలు చేశారు. ఇక పది తగ్గిస్తే పగబట్టి పదికి పది కలిపి మరి పెంచుతున్నారన్నారు. నాడు అడ్డగోలు ఆరోపణలు చేసి,నేడు అడ్డగోలుగా ధరల పెంపు చేస్తున్నారని..పెంచుకో..దంచుకో..పంచుకో..అన్న ధోరణిలో నేడు మద్యం ధరల పెంపు రేపు, రేపు ఏం పెంపో? ఎన్నెన్ని పెంపో? అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news