ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపు

-

బీఆర్ఎస్ నేతలు ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిని రక్షించడం అసాధ్యమన్నారు.

ఈ క్రమంలోనే ఉప ఎన్నికలను ఫేస్ చేసేందుకు బీఆర్ఎస్ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేటీఆర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద వేసిన పిటిషన్లతో కలిపి విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news