ఈ రోజు దుండిగల్ డివిజన్లోని దుండిగల్ గ్రామంలో బీజేపీ మున్సిపల్ కార్యదర్శి శ్రీ తలారి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో SIR హెల్ప్ డెస్క్ విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు SIR ఫారాలు నింపడంలో సహాయం, ఓటరు జాబితాలో పేరు నమోదు, వివరాల సవరణ, మార్పులు తదితర ఓటరు సంబంధిత సమస్యలపై అవసరమైన మార్గదర్శకత్వం అందించబడింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హెల్ప్ డెస్క్ను సందర్శించి సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజిగిరి ఇంచార్జ్ డాక్టర్ ఎస్. మల్లారెడ్డి గారు హాజరై, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ చారి గారు, ఆకుల మల్లేష్ గారు, సీనియర్ నాయకులు ఎస్. అనిల్ గారు, కుమ్మరి సదానందం గారు, సర్కిల్ ప్రధాన కార్యదర్శి తురాయి భాను గౌడ్ గారు, యువ మోర్చా నాయకులు ఆకుల విజయ్, నామాల శ్రీకాంత్, యశ్వంత్ పటేల్, ఏలూరి శ్రీధర్ గౌడ్, నాగేంద్ర బాబు, సి.హెచ్. కిరణ్, గగిలాపూర్ చిన్న, రాజ్ కుమార్ నాయక్, అనిల్ తలారి, రామారం మధు, రామ్, మాదారం నాగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తలారి రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హులైన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు సక్రమంగా నమోదు అయ్యేలా చూసుకోవాలని, ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
అలాగే దుండిగల్ డబుల్ బెడ్రూమ్ కాలనీకి చెందిన చంద్రశేఖర్, దుర్గాప్రసాద్ ముదిరాజ్, వంశీ, పద్మజ, సింధు, సోనీ తదితరులు ఓటర్లకు SIR ఫారాలు నింపడంలో అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
